Followers

మాడుగుల మండల టిడిపి అధ్యక్ష పదవీ యువకులకే కేటాయించాలి

 మాడుగుల మండల టిడిపి అధ్యక్ష పదవీ యువకులకే కేటాయించాలి

పాత వారికి ఇస్తే రాజీనామాలకు సిద్ధం పార్టీ శ్రేణులు

వి.మాడుగుల, పెన్ పవర్

 తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన మాడుగుల మండలం పార్టీ అధ్యక్ష పదవి ఎంపికలో  సందిగ్ధత కొనసాగుతుంది. పార్టీ బలోపేతానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని  తీసుకు రావాల్సి ఉంది. కానీ స్థానిక పార్టీలో  నెలకొన్న అనిశ్ఛితి కారణంగా అధ్యక్ష పదవి  ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా యువతకు అవకాశం ఇస్తే చతికిలపడిన పార్టీలో  ఉత్తేజం వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ టిడిపి మండల అధ్యక్ష పదవికి  పాత పేర్లు  తెరపైకి రావడంతో యువకుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. పార్టీ భవిష్యత్ దృశ్య కొత్తవారికి అవకాశం ఇస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నియోజకవర్గంలోని కే కోటపాడు దేవరపల్లి చీడికాడ మండలాల్లో  టిడిపి అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. మాడుగుల మండలంలో టిడిపి  అధ్యక్ష పదవికి  గాది రాయి  మాజీ సర్పంచ్ అద్దెపల్లి జగ్గారావు  మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరు గతంలో మండల పార్టీ అధ్యక్షులుగా  చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో  వీరిరువురి పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పార్థసారథి ఆలయం వద్ద  టిడిపి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  పార్టీకి చెందిన పలువురు యువకులు  మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగిలారని  యువకులు ఆరోపిస్తున్నరు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్నప్పటికీ  అవకాశం ఇవ్వకుండా  నాయకులు మోకాలడ్డు తున్నారని  మండలానికి చెందిన ఒక వ్యక్తి బాహటంగా ఆరోపించారు. 29 పంచాయతీల్లో సమర్థవంతమైన యువకుడిని ఎంపిక చేస్తే పార్టీలో నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు. మాడుగుల పట్టణంలో  అధ్యక్ష పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెండో వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి దూరం కావాలని  పలువురు భావిస్తున్నారు. 

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో  మాడుగుల లో సర్పంచ్ గా టీడీపీ అభ్యర్థి  పోటీ చేయడానికి ఇష్టపడని ఆ వ్యక్తి కి పార్టీ సంక్షేమం పడుతుందా?  గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  రామానాయుడు ఓటమికి ఈ వ్యక్తే కారణమని  పార్టీ వర్గాలు  ఆ వ్యక్తిని  దూరంగా ఉంచిన  విషయం తెలిసిందే. టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి వెళ్లి మళ్లీ టీడీపీ లోకి వచ్చిన వ్యక్తి  పార్టీ శ్రేయస్సుకోసం ఏ మేర ఆలోచిస్తారని పార్టీ వర్గాలు సంకోచిస్తున్నాయి.ఈ విషయంలో నియోజకవర్గ ఇంచార్జ్ రామానాయుడు కూడా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు  అన్నా సామెత  ఇక్కడ ప్రత్యక్షమైంది. నాడు తన ఓటమికి కారకుడైన వ్యక్తికి మండల పార్టీ పదవి అప్పగిస్తారా? అని చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈవిషయం  జిల్లా అధిష్టానం దృష్టికి కొందరు తీసుకు వెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జికి కూడా ఆ వ్యక్తికీ  పదవి ఇవ్వద్దని  సంకేతాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. కొందరు నాయకుల కారణంగా అసమ్మతి తో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులు  ఈ వ్యక్తి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పనిసరి  ఆ వ్యక్తికి అధ్యక్ష పదవి కేటాయిస్తే  తాము పార్టీ వీడుక తప్పదని  వారు స్పష్టం చేస్తున్నారు. మండలంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల దృష్ట్యా   జిల్లా నాయకత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని  టిడిపి యువత కోరుతున్నారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి

 ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి 

నీటిని పొదుపు చేసి సంరక్షించండి...రూపాకుల రవికుమార్ 

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ గాయత్రీ వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం   ఆవరణలో  కొత్తగా నిర్మించిన  3వ ఇంకుడు గుంతను ప్రారంభించారు.ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ రానున్న రోజులలో నీటిని పొదుపు చేయటమే లక్ష్యంగా మహిళలు ముందుకు సాగాలని నీటి కోసం పక్క రాష్ట్రముల వారితో విభేదాలు రాకుండా ,నీటి యుద్ధాలు జరగకుండా నీటిని పొదుపు చేసుకోవాలని అన్నారు.ఇంకుడు గుంతల లోకి  నిత్యము వాడుకునే నీరు మరియు వానల ద్వారా వచ్చిన నీరు చేరే లాగా నిర్మించాలని  అన్నారు.  

ఆరు అడుగుల లోతు లో సుమారు మూడడుగుల  వెడల్పుతో  ,ఇంకుడు గుంతను తవ్వించి ,40ఎమ్.ఎమ్.మెటల్, 20ఎమ్.ఎమ్.మెటల్ , ఇసుక మరియు 10ఎమ్.ఎమ్ మెటల్ తోటి ఇంకుడు గుంతను మూడు వంతుల వరకు నింపాలని అన్నారు.సుమారు  ఒక్కొక్క ఇంకుడు గుంత కు 12  వేల నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందని అన్నారు.దుబారా నీటి వాడకం తగ్గించాలని ,బహుళ అంతస్తుల్లో కనీసం ఆరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అన్నారు.నీటి ఎద్దడి నుంచి ఆనాడే మనకు రక్షణ కలుగుతుందని సూచించారు.

ముఖ్యముగా విశాఖ నగరంలో ఎండాకాలంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుందని ఈ సమస్యకు పరిష్కారము  ప్రతి ఇంటా ఇంకుడు గుంతల ఏర్పాటు చేయాలని  అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,ఎస్ మహేష్ ,ఎస్ చాతుర్య ,గేదెల శ్రీహరి,హిమబిందు, డాక్టర్ వైలక్ష్మణరావు,శంకర్రావు,మాధవి మొదలగువారు పాల్గొన్నారు .

32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుకు అభినందనలు తెలిపిన వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది

 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుకు అభినందనలు తెలిపిన వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది

మహారాణి పేట, పెన్ పవర్

వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సహనంతో సేవా భావంతో పనిచేయాలని తనను కలసిన వాలంటీర్లకు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు.కార్పొరేటర్ గా గెలిచిన నాగరాజును వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వార్డుకు సంబదించిన ఈ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.వార్డు పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు,పించేన్లు,ఇంటి ఇంటికీ రేషన్ వంటి కార్యక్రమంలో నిరంతరం కొనసాగేలా చేరాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని తన సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని నాగరాజు తెలిపారు.

వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ఉత్సవాలు

 వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ఉత్సవాలు

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖపట్నంలో విద్యారంగంలో 75 సంవత్సరాల నుండి ఎంతోమంది మేధావులుగా తీర్చిదిద్దిన టువంటి ద్వారక నగర్ లో ఉన్న వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులతో స్కూలు యాజమాన్యం యొక్క సహకారంతో   ట్రాకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత ఉత్సవాల్లో భాగంగా మాధవధార మురళి నగర్ పలు ట్రాఫిక్ కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు పలు సూచనలను లేఖ రూపంలో స్పీడ్ డ్రైవ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే రూపంలో వివరించారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా?

 తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా? 

గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగు

ఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

మహారాణి పేట, పెన్ పవర్

జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగు ఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్. జీవీఎంసీ ఎన్నికలు ముగిసి కౌన్సిల్ కొలువు దీరినా  మేయర్ ప్రమాణ స్వీకారం చేసినా రామకృష్ణ బీచ్ లో ని దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి ఉన్న ముసుగును  అధికార యంత్రాంగం తొలగించక పోవడంపై  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఆ మహనీయుని విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముసుగు తొలగించి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్  మాట్లాడుతూ వుడా పార్క్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం సహా నగరంలో అన్ని విగ్రహాలకు ముసుగులు తొలగించినప్పటికీ రామకృష్ణ బీచ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు తొలగించక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు బాధ్యులైన సంబంధిత జివిఎంసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు, కార్పొరేటర్లు వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కౌన్సిల్ హాల్ కి వెళ్లారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు విశాఖ నగర ప్రజలు 30 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ లను గెలిపించారన్నారు. అయినా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించి శుభ్రం చేయడం పై శ్రద్ధ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తెలుగుదేశం నాయకుల పట్ల టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి జరిగిన ఈ అవమానానికి ఆయన కుటుంబ సభ్యులు విశాఖ చేరుకుని ఆయన ఆత్మ శాంతికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించాలని కోరారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో అందరికంటే ఎక్కువగా ప్రజామోదం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కె.రమేష్ బాబు, డాక్టర్ పి.జయశ్రీ, వంశీ,ఎస్.హరి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు పెద్ద పీట వేయడం హర్షణీయం

 మహిళలకు పెద్ద పీట వేయడం హర్షణీయం

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ....కొణతాల సీతారాం

విశాఖపట్నం, పెన్ పవర్

మహిళలకు పెద్ద పీట వేసి మేయర్ లు, మునిసిపల్ చైర్మన్లు గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అభినందనీయమని మహిళలకు పెద్ద పీట వేయడం పట్ల మహిళా సాధికారత చేకూరుతుందని అన్నారు.పదవులను అలంకిరించిన వారు పరిపాలనా సాధికారత అంశంలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా తయారు కావాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని మంచి అని తప్పులు చేస్తే అవి తప్పు అని జై అనకాపల్లి సేన ఎప్పుడు తేల్చి చెప్తుందని స్ఫష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేయర్, చైర్మన్ లుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కో వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోండి

 కో వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోండి

పెన్ పవర్, వరదయ్యపాలెం

వరదయ్యపాలెం, చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంబమైనట్లు వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్దులందరికీ,  45ఏళ్ల నుంచి 59ఏళ్ల లోపు వారికి ప్రత్యేకంగా మధుమేహం (సుగర్) బీపీ, క్యాన్సర్, గుండె వ్యాధులు ఇతర దీర్జకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఎవరూ అపోహలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...