Followers

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి 




విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉత్తర నియోజకవర్గం లో  53,54,55,42 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ముందుగా  మురళీనగర్ లో  ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం  ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు  దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార సీడీని ఆవిష్కరించారు  అనంతరం. 53 వార్డు శివనగర్, 54 వార్డు మర్రిపాలెం, జ్యోతి నగర, నలంద నగర్, గజపతినగర్, 55 వార్డు గాంధీనగర్, తిక్కవాని పాలెం, ధర్మానగర్, తాటిచెట్ల పాలెం, 42 వార్డు రైల్వే న్యూ కొలనీ, నందగిరి నగర్, రెల్లి వీధి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ పర్యటన లో ఆ యా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించారు.వాటిలో కొన్ని వెంటనే చేయుటకు హామీ ఇచ్చారు. కొన్ని సంబంధించిన శాఖ లతో మాట్లాడి పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, లోక్ సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి, వరుదు కల్యాణి, మాధవి వర్మ, మాజీ వుడా చైర్మన్ రవి రాజు,  మిలినియం శ్రీధర్ రెడ్డి వార్డు సీనియర్ నాయకులు , మహిళలు, కార్యకర్తలు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం...

  సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం



  సింహాచలం, పెన్ పవర్ ...

   శ్రీ  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం ( సింహాచలం) ఈవోగా ఎం. వి  సూర్య కళను  నియమిస్తూ ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది.  విశాఖ  జాతీయ హైవే నెంబర్ 16 కు  భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సూర్య కళని,   రెవెన్యూ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా...  నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాసు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో విశాఖ జెసి 2 గా  పని చేసిన విషయం తెలిసిందే.  కాగా  సింహాచలం దేవస్థానం పరిధిలో భూకబ్జాలు,  ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి, అనేక  సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అలాగే  గతంలో పనిచేసిన ఈ వో లు అవినీతి పరులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దేవస్థానం పరిధిలో భూములు అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని,  ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య కళ నియామకం ప్రత్యేకత సంతరించుకుంది. అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు...   ఆమె అడ్డుకట్ట వేస్తారని  భక్తుల విశ్వాసి స్తున్నారు.

తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

 తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

తొర్రూర్ ,పెన్ పవర్.


  ప్రపంచ ఫౌండేషన్స్ డే ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్యూచర్  స్టార్స్ ఫౌండేషన్  వాలంటీర్స్ ఆధ్వర్యంలో మహుబూబాద్ జిల్లా తొర్రూర్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనాధ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులుపంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ స్టార్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రుద్రారపు  మహేష్ జనరల్ సెక్రటరీ ఆర్కే, జె  అశోక్  వైస్ ప్రెసిడెంట్  మురళి కృష్ణ, జాయింట్ సెక్రటరీ రుద్రారపు  సురేష్,మరియు వాలంటీర్స్ అరుణ్,తుర్పాటి శేఖర్, రా కేష్ మధు  డి. శీను , ఏ మహేష్  ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ,కాసుల శ్రీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు స్కూలు ప్రధానోపాధ్యాయులు పి శ్రీను బాబు,, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు , అలీ, వినోద్ రెడ్డి  ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు...

 పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు..



పైపు లైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం

మంచి నీటి కోసం ఆదివాసీ మహిళల అవస్థలు

తక్షణమేతాగు నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ డిమాండ్

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

  పాడేరు ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీటి సమస్యతో ఆదివాసీ మహిళలు అల్లాడుతున్న  అధికారులు పట్టించుకో లేదని సిపిఐ డివిజన్ కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పేరుకే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్, మరియు గ్రావిటీ పైపులైన్లు. ప్రజలకు మంచి నీరు అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని మండి పడ్డాడు. ఇది ఎక్కడో మారు మూల కాదు పాడేరు ఐటీడీఏ వెనకాల ఉన్న  వీధి లో ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా  ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇది మన ఐటీడీఏ తీరని వాక్యనించారు. పాడేరు మండలం పాడేరు ఐ.టి.డి.ఎ కు ఆనుకుని ఉన్న ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీళ్ల సౌకర్యం లేక కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక నానా అవస్థలు పడుతున్న. అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు: వారు మాట్లాడుతూ ఐటీడీఏకు ఆమడ దూరంలో లేని ఐటీడీఏ వెనకాల ఉన్న  ఐటీడీఏ రేకుల కొలనీ గ్రామం మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రికల్లో ప్రకటనలు  వచ్చిన కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గం వారన్నారు ఐటీడీఏ వెనకాల ఉన్న వీధిలోనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా ఉంటుందో కూడా చెప్పనవసరం లేదని ,వారు అన్నారు పాడేరు పట్టణంలో  పేరుకే పెద్ద  ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ మరియు గ్రేట్ పైప్ లైన్లు అలంకార ప్రాయం తప్ప ప్రజలకు మంచినీరు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మహిళలతో పెద్ద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్




 పెన్ పవర్  న్యూస్ విశాఖపట్నం సీటీ

  21 వార్డ్ పరిధిలో గల కోటక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఆయా పరిధిలో గల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తూ, వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ,   ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. విశాఖలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయుటకు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి  ప్రణాళిక సిద్ధం చేసారని అన్నారు.  అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరుటకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డ్ లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొలంబడి కార్యక్రమం

 పొలంబడి కార్యక్రమం



తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలంలో తాళ్ళపూడి  గ్రామం రైతులకు శనివారం ఆత్మా తాళ్ళపూడి వారి సౌజన్యంతో వరిలో సమగ్రమైన సస్యరక్షణ, వ్యవసాయ, ఉద్యాన ప్రభుత్వ పథకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిoచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ-పంట నమోదు, రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన ఇన్పుట్స్ సప్లై, డా.వైయస్సార్ పొలంబడి, కస్టమ్ హైరింగ్ సెంటర్స్, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు మొదలగు అంశాలను మండల వ్యవసాయ అధికారిణి జి.రుచిత వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నక్కా చిట్టిబాబు, ఉపసర్పంచ్ జి.వి.వి.సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు ఆనంద్, రేవతి, తాళ్ళపూడి పంచాయతీ సెక్రెటరీ వీరన్న, కుకునూరు సెక్రెటరీ యస్.శ్రీను, మరియు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం

 దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం




దాబా గార్డెన్స్ విశాఖపట్నం పెన్ పవర్ న్యూస్ 

విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన VJF ప్రెస్ క్లబ్ డాబా గార్డెన్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పర్వీన్ బాబీ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో 85 శాతం పంచాయతీలను గెలుచుకొని, పల్లె ప్రజల అభిమానాన్ని చురగొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామని త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా తమ అంచనా ప్రకారం పంచాయితీ ఫలితాలు కన్నా ఎక్కువ శాతం సీట్లు సాధించి, అన్ని మేయర్ పదవులను ఆదిష్టిఇస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక సంస్కరణలే అని అన్నారు. ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు అమలు చేసి వారి అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ అనతి కాలంలోనే 100శాతం  ముస్లింల అభిమానాన్ని చూరగొన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అన్నారు. జీవీఎంసీ ఎలక్షన్ దృష్ట 98 వార్డులకు గాను 75 వార్డులలో నామినేషన్ ఒక కొలిక్కి వచ్చిందని మిగతా 25 వార్డులలో నామినేషన్ వేయవలసి ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీ ఎన్నికలలో సీటు కేటాయించిన రెండు సీట్లను గెలిపించుకోవడం తోపాటు, ఇతర వార్డులలో కూడా తమ వంతు కృషి గా ప్రచారం చేసి, అఖండ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడం కోసం తాము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. 75 వార్డులకు గాను కొంతమందికి బీఫామ్ ఇచ్చారని కొన్ని వార్డులలో అభ్యర్థులు యొక్క వార్డులలో ప్రాధాన్యం ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి కాదా ఇతర కారణాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న గుర్తింపుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నవారిని ఆరా తీసి సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నాను అని అన్నారు. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం. దీనిలో భాగంగా 3000 జనాభాతో ముస్లింలు 39 వ వార్డు లో రెండో స్థానంలో ఉన్నారని గత ఎన్నికలలో వీరు అధికంగా ప్రభావం చూపించారు. ప్రతిసారి ఒకే వర్గానికి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ ఈ సారి కి తప్పనిసరిగా ముస్లింలకు ఆ సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాము. పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల పరిశీలన గడువు ముగిసినప్పటికీ ఉపసంహరణ ఇంకా గడువు ఉన్నందున ముస్లిం అభ్యర్థి దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న వార్డులలో అవకాశం  కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోప్రార్వీన్ భాబీ, రేష్మ, సీమ, నాజమా, రుబినా ఖాతున్, ఖాతీజ, మెహెరావున్నిసా, రెహానా, నగ్మా,  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...