Followers

నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 నిందితులను అరెస్టు చేయాలంటూ  హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 వనపర్తి, పెన్ పవర్

వనపర్తిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  విభాగ్ కో కన్వీనర్ అభిలాష్  హౌదే  కార్ ప్రసంగిస్తూ  ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో  ఉన్న హిందువుల పైన వారి ఆస్తుల పైన వ్యాపార సంస్థల పైన దాడులను ప్రోత్సహించే వారికి అండదండలు లు కల్పించి తరచుగా హిందువులపై దాడులు చేయాలని చూస్తున్నారని,  హిందువులను బలిపశువులను చేస్తున్నారని తెలిపారు. పదే పదే హిందువులపై జరుగుతున్న దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ హిందువులపై పునరావృతం కావద్దని కోరారు.ధర్నా కార్యక్రమంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది హిందు వాహిని కార్యకర్తలను  పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ అరుణ్ జిల్లా భేటీ బచావో ప్రముఖ సహా ప్రముఖ నవీన,పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ,రోహిత్,గణేష్, ప రాకేష, మణిదీప్,చరణ్ ,ప్రేమ్ నందా, నీలేష్,నరేష్,సాయి, గిరీష్,తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన జె సి మరియు ఎస్ పి

 పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన  జె సి మరియు ఎస్ పి 

పెన్ పవర్,కొవ్వూరు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం లోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. నారాయణ నాయక్.కొవ్వూరు మున్సిపల్  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  కొవ్వూరు పట్టణం నందు సమస్యాత్మక,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సదరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గురించి తనిఖీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్  హిమాన్షు శుక్ల మాట్లాడుతూ రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది కలిసి ఎన్నికలు సామరస్యంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాం.ఓటర్ల లందరూ అధికారుల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు.వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా  వినియోగించుకుంటున్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారికి రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాగా పోలీసు రక్షణ ఏర్పాట్లు చేశారు.కొవ్వూరు  మున్సిపాలిటీ పరిధిలో  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఆక్కడ  మున్సిపల్, రెవిన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన  భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసినారు.జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి ,ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పీ  ఏ.శ్రీనివాసరావు, కొవ్వూరు టౌన్ సీఐ ఎం. వి. వి. ఎస్. ఎన్. మూర్తి, కొవ్వూరు టౌన్  ఎస్సై లు  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు

 గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి .ఇనుగంటి శ్రీనివాస్

పెన్ పవర్,జగిత్యాల 

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలానికి చెందిన ఇనుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలోNRI పాలసీ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్ లో ఐదు వందల కోట్ల నిధులు  తెలంగాణ NRI పాలసీ కొసం కేటాయించాలి, అని  గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న మేము అందరం GWAC అధ్యక్షులు శ్రీ కృష్ణ దొనికిని గారి పిలుపు మేరకు మేము దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ లో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇనుగంటి శ్రీనివాస్, ప్రవీన్, కన్నా, ఉపేంద్ర, రావు, సాయి, శేకర్, రవిశంకర్, అనిల్, సతీష్, చారి, అజారుద్దీన్, రాజేష్, స్వామి, నాగేంద్ర, భూమేష్, మహేష్, రాకేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు..

సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....

 సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....

స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్

అదిలాబాద్ , పెన్ పవర్ 

అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింప పడిన దేశంలో ఆనాటి సమాజ కట్టుబాట్లను ధిక్కరించి స్త్రీలకు పాఠశాలలు నిర్మించి పాఠాలు నేర్పిన విద్యాదేవత సావిత్రి బాయి పూలే అని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్ అన్నారు. బుధవారం స్థానిక అంభేడ్కర్ భవనములో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్థంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీల హక్కుల కోసం ఎంతగానో పోరాడారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి  చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ అధ్యక్షుడు సందీప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ కాంభ్లే బాబారావు, వార్డు సభ్యులు థిట్టే నాగరాజ్, గాయక్ వాడ్ భారత్, స్వేరోస్ మండల నాయకులు జంధడే బాలాజీ, సూర్యవంశీ బాదల్, గాయక్ వాడ్ బాబాసాహెబ్, వాగ్మారే పండిత్, తదితరులు పాల్గొన్నారు.


మీడియా పై దాడులు తగదు

 మీడియా పై దాడులు తగదు

జర్నలిస్టులకు భద్రత కల్పించాలి

ఆదిలాబాద్,పెన్ పవర్

నిర్మల్ జిల్లా భైంసాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ బోథ్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బోథ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై  దాడులు పెరిగిపోయాయన్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.దాడుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని, వారిపైనే దాడులు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

 పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గుడిహత్నూర్,పెన్ పవర్

గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన  విజయ్ కుమార్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్. ప్రవీణ్  తెలిపారు. పోలీసుల వివరాల మేరకు  మాన్కపూర్ గ్రామానికి చెందిన  విజయ్ కుమార్ కు గత కొన్ని రోజులుగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.మంగళవారం సాయంత్రం 5:30 గం. ల సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరగడంతో   తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగగా  గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు  తెలిపారు. మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు

 ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు 

పెన్ పవర్, బయ్యారం

ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మహబూబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యులు కొండపల్లి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ  ఆదేశానుసారం ఈ నెల 14 వ తారీఖు న జరుగు*ఖమ్మంవరంగల్నల్గొండ*పట్టభద్రుల శాసనమండలినియోజకవర్గ MLC  ఎన్నికలకు టిజేస్ అభ్యర్థి ప్రజాస్వామికవాది, గౌరవనీయులు  శ్రీ #ప్రొఫెసర్_కోదండరాం గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసిఅఖండమెజారిటీతోగెలిపించాలనిమహబూబాబాద్‍ పార్లమెంట్ నియెజకవర్గ పరిదిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గ టిడిపినాయకులకు ,కార్యకర్తలకు,మేదావులకు,ఉద్యోగులకు,నిరుద్యోగగ్రాడ్యుయేట్స్ కు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి రామచంద్ర రావు మరియు బయ్యారం మండలం టిడిపి నాయకులు  పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...