Followers

గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం తాడిపూడి లో జనసేన నాయకులు మరియు తాడిపూడి పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంటా కృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్టింగ్ చేసి, ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ స్వీట్, హాట్ పంచారు. ఈ సందర్భంగా కొంతమంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి గంటా కృష్ణ పార్టీ కండువా కప్పి, పార్టీలోని కి ఆహ్వానించడం జరిగింది. గంటా కృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా  మనమంతా కలసి పనిచేసి పార్టీని అభివృద్ధి పధంలో నడిపిస్తూ, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను అఖండమైన మెజారిటీతో గెలిపిద్దామని అన్నారు. నాయకులంతా కలిసి పనిచేయడానికి ఇష్టతను చూపారు.  ఈ కార్యక్రమంలో ఆర్.యస్.మూర్తి, వీరిశెట్టి సీతారామయ్య,  బొక్కా నాగేంద్ర, పెండెం పోసిబాబు, అక్కాబత్తుల లక్ష్మణ్, చింతపల్లి అంజి, చెన్నా గంగయ్య, రావూరి పోసి, గుర్రాల పోసి దొరయ్య, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలే పోలింగ్ వృద్ధికి కారణాలు

 ప్రభుత్వ వైఫల్యాలే పోలింగ్ వృద్ధికి కారణాలు

కూకట్ పల్లి,పెన్ పవర్

హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ప్రతిభ  స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను సందర్శించిన టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో నమోదైన పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని, పోలింగ్ శాతం పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆయన అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో కొన్నిచోట్ల కుటుంబసభ్యుల ఓట్లను వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బూత్ లో వేయడం జరిగిందని., అయిన సరే ఓటర్లలో వచ్చిన ఓక ఆలోచన వారిని ఓటు వేసే విధంగా ముందుకు నడిపించిందని తెలిపారు. కేంద్ర  ప్రభుత్వం పన్నుల రూపంలో సామాన్య ప్రజలపై భారం వేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను రెండోసారి అధికారం వచ్చిన సరే నెరవేర్చడం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్, పద్మ చౌదరి, అట్లూరి దీపక్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాళ్ళపూడిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

 తాళ్ళపూడిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

తాళ్ళపూడి, పెన్ పవర్

ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, తాళ్లపూడి శాఖ ఆధ్వర్యంలో  తాళ్లపూడి బస్టాండ్ వద్ద గల కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో  రాజమండ్రి గౌతమి నేత్రాలయం,  అర్జున్ గైనిక్, సన్ స్టార్ వారి సౌజన్యం తో  ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరాన్ని మండల గౌరవ ఛైర్మన్ సింహాద్రి జనార్దన్ రావు  ప్రారంభించారు. శిబిరానికి సుమారు 300మంది హాజరయ్యారు.  అందులో ఇరవై మందికి  కళ్ళ శస్త్ర చికిత్సలు అవసరమని వారిని ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లామని గౌతమి నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.  అవసరమైన 70మందికి కళ్ళజోడ్లు సూచించామని  తెలిపారు.  కళ్ళజోడు అవసరమైన వారందరికి తానే ఉచితంగా అందజేస్తానని ఛైర్మన్ సింహాద్రి జనార్ధనరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య, ఉపాధ్యక్షులు తుంపూడి నాగభూషణ గుప్త,  కోశాధికారి చెరుకు ఆంజనేయులు,  మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, రుక్మాంగధ ఆవాల, సభ్యులు డెంటిస్ట్ జి.సాగర్, ఈసి మెంబర్ గెడ్డం రమా సత్యనారాయణ, గంధం మునేశ్వరరావు, సీనియర్ సభ్యులు గెడ్డం సాయిబాబా, మాజీ అధ్యక్షులు మాధవరపు రామచంద్రరావు, శాశ్వత సభ్యులు దుగ్గిరాల సూర్యనారాయణ, కరిబండి డిగ్రీ కాలేజ్  ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కోఆర్డినేటర్ డి.మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రి పై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

 హోంమంత్రి పై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ప్రతిభ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వచ్చి పలానా అభ్యర్థికి ఓటు వేశాము, మీరు కూడా ఆ అభ్యర్థికే ఓటు వేయండి అని చెప్పడం దేశ చరిత్రలో ఇంత వరకు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవని,అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలింగ్ బూత్ వద్ద గులాబీ రంగు దుస్తులు ధరించి   తిరుగుతున్నా సరే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఎలక్షన్ లు చూసిన అధికార పార్టీకి బుద్ధి లేదా అని రామచంద్ర రావు ప్రశ్నించారు. భారీ సంఖ్యలో పట్టభద్రులు ఈసారి జరుగుతున్న ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని,  పోలింగ్ కేంద్రాల్లో ఒక్క క్యాబిన్ ను ఏర్పటు చేయడం వల్ల ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

 రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

వేములవాడ,పెన్ పవర్

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. రాష్ట్ర నలుమూలల నుండి రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, కోడె మొక్కుల క్యూలైన్ల మీదుగా ఆలయంలో చేరుకుని తన ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 30 వేల మంది కి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరించినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ప్రభుత్వానికి కాపులపట్ల వివక్ష తగదు

 ప్రభుత్వానికి కాపులపట్ల వివక్ష తగదు

పెన్ పవర్,రావులపాలెం

కాపు కార్పొరేషన్ విదేశీ విద్య దీవెన పథకం ద్వారా విదేశాలలో చదువుకుంటున్న వందలాది మంది పేద కాపు విద్యార్థులకు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి గత 20 మాసాలు గడిచినా  ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర టెలికం సెల్ కన్వీనర్  పాలూరి సత్యానందం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొత్తపేటలో మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులకు చెందిన అంబేద్కర్ విదేశీ విద్యా నిధికి జగన్ ప్రభుత్వం డిసెంబర్ 5న 25 కోట్ల రూపాయలు విడుదల చేయడం హర్శించదగ్గ విషయమని, అయితే కాపు విద్యార్థుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్న పేద కాపు విద్యార్థుల గోడు పట్టదా అని, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఎందుకు పెదవి విప్పటం లేదో చెప్పాలని పాలూరి ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చుచేసి ఉద్దరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ఈ జగన్ ప్రభుత్వం కాపు యువతను ఆదుకోవాలని, పెండింగ్ సొమ్ములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై స్పందిస్తూ పలువురికి లేఖలు రాసే మాజీమంత్రి,  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు పేద విద్యార్థులకు విదేశీ విద్య దీవెన పథకం అమలు చెయ్యాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయాలని పాలూరి కోరారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మందమర్రి,పెన్ పవర్ 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మందమర్రి పట్టణంలో పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాయ రమేష్, పిట్టల సుధాకర్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ, రాష్ట్రంలో ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు పొన్నం హరీష్, నాయకులు ల్యాబ్ సంతోష్, చిరు వెంకటేష్, ఫైట్ మాస్టర్ రాజ రమేష్, అరవింద్, తరుణ్, నిహిత్, శ్రీనివాస్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...