Followers

పారదర్శకంగా/ కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు

 పారదర్శకంగా/ కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు 



మంచిర్యాల ,  పెన్ పవర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో  రామగుండం  కమీషనరేట్ పరిధిలో పనిచేయుచున్న మంచిర్యాల జిల్లా సివిల్ సిబ్బంది ఏఎస్ ఐ /హెడ్ కాన్స్టేబుల్ /కానిస్టేబుల్ మొత్తం 61మంది సిబ్బందికి పోలీస్ కమిషనర్  వి.సత్యనారాయణ ఐపిఎస్  కౌన్సిలింగ్ నిర్వహించి, వారి స్యమస్యలు అడిగి తెలుసుకొని కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలో  కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు.అనంతరం సిపి  మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలతొ మంచి సత్ససంబందాలను ఏర్పాటు చేసుకుని,  ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనిచేసి  పోలీస్ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ అడిషనల్ డిసిపి ఏఆర్ కమాండెంట్  సంజీవ్, సుందర్ రావు,ఏసీపీ ట్రాఫిక్ బాలరాజు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు నారాయణ, సతీష్,ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్,బాబు రావు, కుమారుస్వామి,ఆర్ ఐ లు మధుకర్,అనిల్,శ్రీధర్, విష్ణు,సీపీఓ సిబ్బంది సూపరిండెంట్ శ్రీనివాస్,సీనియర్ అసిస్టెంట్ పోతారాజు రామగుండం పోలీస్ సంఘము అధ్యక్షులు పోచలింగం పాల్గోన్నారు.

ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కి బెదిరింపు

 ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కి బెదిరింపు


మంచిర్యాల ,  పెన్ పవర్

 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని ఓ గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. మంగళవారం భార్య భర్తల గొడవల వల్ల  పోలీసులు సహకరించాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. మంచిర్యాలలోని హమాలివాడ చెందిన పసుపులేటి శేఖర్ . వివరాల్లోకి వెళితే తన భార్య తనకు మధ్య మనస్పర్ధలు , గొడవలు జరగడంతో పసుపులేటి శేఖర్ ప్రభుత్వాసుపత్రి పైకి ఎక్కి కిందికి దూకుతానని బెదిరింపుకి పాల్పడ్డాడు.అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తి తో వ్యవహరించి  శేఖర్ భార్య ఫోన్లో మాట్లాడుతుందని చెప్తూ నీతో మాట్లాడుతది అంటూ మాటల్లో పెట్టి కిందికి లాగేసాడు. కాగా ఎస్ఐ ప్రవీణ్ బాధితుడు శేఖర్ ను పోలీస్ స్టేషన్ కు అదుపులో కి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో గంటపాటు హైరానాపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి

 మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి

 పెన్ పవర్,ఆత్రేయపురం

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీడీవో నాతి బుజ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ఉనికి లేకుండా ఉమ్మడి మద్రాసు లో తెలుగు వారికి ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడి అందుకోసం ఆమరణ నిరాహార దీక్షలో తన ప్రాణాలు వదిలిన అమరజీవి ఆంధ్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి త్యాగమూర్తి ఆయన చిరకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారు అని ఆమె  కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది భాగ్యలక్ష్మి. వల్లి  విద్యా శాఖ సిబ్బంది కార్యదర్శులు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎంపీడీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సచివాలయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది.

వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు

 వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు


ఆదిలాబాద్,  పెన్ పవర్

 ఉట్నూర్ మండలం లోని తాంధ్ర గ్రామంలో గోవింద్- సరిత, బేల మండలంలోని ఖరా గ్రామంలో సిడం శ్యామ్రావ్- లక్ష్మీ నుతన వధూవరులను  మంగళవారం  ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా - పవన్ రావు దంపతులు పెళ్లి శుభకార్యంలో పాల్గొని   స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు చారులత రాథోడ్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనం చేశారు. సుఖ సంతోషాలతో వందేళ్లు కలిసిమెలిసి ఉండాలని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జంగు,  స్థానిక సర్పంచ్ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

కరోనా నిబంధనలు పాటించని "మార్టిన్స్" పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

 కరోనా నిబంధనలు  పాటించని "మార్టిన్స్"  పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

 ...జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత 

మంచిర్యాల , పెన్ పవర్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలోని డీ ఈ ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ   జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడితూ మంచిర్యాల జిల్లా లోని సిసిసి కార్నర్లో  ఉన్న మార్టిన్స్ అను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు  పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ఎల్కేజి,నుంచి 5తరగతి వరకు తరగతులు నడిపిస్తూ  ఒకే గదిలో 30 నుంచి 40 మందిని కూర్చోబెట్టి తరగతులు బోధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి కరోనా  వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మార్టిన్స్ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని, ఫీజుల పేరుతోటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ  అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని  భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు పవన్ కళ్యాణ్,శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు.

స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

 స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

కూకట్ పల్లి, పెన్ పవర్

మల్లిఖార్జున స్వామీ, ఎల్లమ్మ తల్లీ ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కుల పాండురంగారావు. మంగళవారం కూకట్ పల్లి మల్లిఖార్జున స్వామీ, రేణుక ఎల్లమ్మ  తల్లీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామీ, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈసందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా కరోన భయాలు పోలేదని, ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ భయపడుతు బ్రతుకుతున్నారని, స్వామీ అమ్మవారల ఆశీర్వాదాలతో కరోన వైరస్ పోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్

 ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్...


పెన్ పవర్,  బయ్యారం

ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లాపరిషత్ చైర్మెన్..ఫోడుభూములకు ట్రెంచ్ పనులు నిలిపివేయాలని చైర్మెన్ అంగోత్ బిందు అధికారులను నిలదీశారు..మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రమచంద్రాపురం గ్రామపంచాయతీ పందిపడే గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న పట్టా భూముల్లో ఫారెస్ట్ అధికారులు మంగళవారం ట్రెంచ్ కొట్టి సాగు చేస్తున్న భూములను లాక్కోవడంపై గిరిజనులు ఆందోళన చేసి మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ కు, పిర్యాదు చేయడంతో.. అంగోత్ బిందు చైర్ పర్సన్, వెంటనే పందిపడే గ్రామంలో జరుగుతున్న ట్రెంచ్ పనుల పరిశీలనకై వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బానోత్ రంగమ్మ..జాటోత్ పూలమ్మ.., కమలమ్మలకు.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ.. సాగుచేయనీయకుండా భూముల్లో ట్రెంచ్ ఎలా కొడుతున్నారని అంగోత్ బిందు ఫారెస్ట్ అధికారులను నిలదీశారు.. తాము జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆదేశానుసారము పనులు చేస్తున్నామని అటవీశాఖ అధిజారులు తెలుపడంతో..జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బిందు ఆగ్రహంతో జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫోన్ చేసి పట్టాలు ఉన్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తున్నారని వెంటనే పనులు నిలిపివేయాలని ఆగ్రహించడంతో..అటవీశాఖ అధికారులు అంగీకరించి ట్రెంచ్ పనులు నిలిపివేశారు.. ఈ సందర్బంగా మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ అంగోత్ బిందు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు 2005 కు పూర్వము పోడు చేసిన సాగు భూముల, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని.. వారి హామీ మేరకు పోడు పట్టాల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు కూడా సాగు భూముల్లో ట్రెంచ్ పనులను చేపట్టవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.., ఈ విషయమై జిల్లా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ద్వారా సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో అందరూ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి పొడు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని,, పందిపడే గ్రామ గిరిజన పొడు రైతులకు చైర్మెన్ హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, రమచంద్రాపురం సర్పంచ్ పోలెబోయిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండల ఫారెస్ట్ అధికారులు, గిరిజన రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...