Followers

Showing posts with label ANDHRA PRADESH. Show all posts
Showing posts with label ANDHRA PRADESH. Show all posts

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

 తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాక్సినేషన్ లో భాగంగా ఇచ్చే రెండవ డోసు కు  కోవాక్సిన్ డోసులు తగినన్ని అందుబాటులో లేక కోవాక్సిన్ మొదటి డోసు వేసుకొని రెండవ డోసు కొరకు చాలామంది నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేపట్టడంతో అధిక శాతం ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ లైన్ లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కావున ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచితే డబ్బులు వెచ్చించి వ్యాక్సిన్ వేయించుకునేవారైనా కొవిడ్ బారినుండి రక్షింపబడతారని,కరోనా బారిన పడి ఆక్సిజెన్ అందక ఇబ్బంది పడుతున్న రోగులకు సరిపడా ఆక్సిజెన్ సరఫరా చేయకపోవడంతో, ఆక్సిజెన్ అందక చాలామంది కరోనా రోగులు ఆసుపత్రుల బయటనే చనిపోతున్నారని, ఆక్సిజెన్ సరఫరాను కూడా పెంచాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా సోకినట్లైతే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని,వారికి సరైన అవగాహన కల్పించి తగిన చికిత్సను అందజేయాలని, కరోనా టెస్టులు చేయించుకున్న తరువాత ఐదు రోజుల నుండి వారం రోజుల వరకు గానీ ఆ టెస్టు రిపోర్టులు రానటువంటి పరిస్థితి ఏర్పడటం వలన,ఈలోపు టెస్టు చేయించుకున్న వ్యక్తికీ గానీ కరోనా ఉన్నట్లయితే మరికొంతమందికి వ్యాపించే అవకాశం ఉన్నదనిి, కరోనా టెస్టుల ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించి రోగులు తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే టెస్టు రిపోర్టులు వచ్చేవరకు ఆగకుండా వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కరోనా బారిన పడిన వారి ప్రాణాలను కాపాడాలని  భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను సందర్శించిన తిప్పల

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను  సందర్శించిన తిప్పల 

గాజువాక, పెన్ పవర్

విశాఖపట్నం అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ సందర్శించిన గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అక్కడ ఉన్న సమస్యల్ని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో పర్యవేక్షించి మరియు అక్కడున్న పరిసర ప్రాంతాన్ని తరచుగా శానిటైజర్ చేయమని ఆదేశించారు. హాస్పిటల్ లో ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను సూపరిండెంట్ ద్వారా తెలుసుకుని మరియు ఈ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా మారిస్తే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రెగ్నెంట్ లేడీస్ తరచుగా డాక్టర్ చెకప్ వస్తూ ఉంటారు. 

 చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మరి దీన్ని కోవిడ్ హాస్పిటల్ గా మారిస్తే వాళ్లందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయని దేవన్ రెడ్డి  సూపర్డెంట్ తెలియపరిచారు. మరి దీనికి స్పందిస్తూ దేవన్ రెడ్డి ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకు తెలియపరుస్తాను అని హామీ ఇచ్చారు అలాగే కరోనా టెస్ట్స్ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు.రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ గా 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సి.ఏం,జగన్ కు మనం ఎప్పుడూ కూడా విధేయులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 66 వార్డ్ కార్పొరేటర్ ఇమ్రాన్  తదితరులు పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు కరోనాతో చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చెకూరాలని గురువారం 6 మే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మన జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు 50 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షురాలైన షేక్  మున్ని  సహయ సహకారాలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ కేశవరావు  స్టేట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలు పిల్ల సత్యవతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. ఆదిలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లాయువజన విభాగం వైస్  ప్రెసిడెంట్ షేక్ గౌస్ లజం  తదితరులు పాల్గొన్నారు.


చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

 చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

గాజువాక, పెన్ పవర్

చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి మీరు అంత ఇంట్లోనే వుండండి అని గాజువాక జనసేన మహిళ నాయకురాలు రెయ్యి రత్న కోరారు.ఉదయం లేస్తే ఏమి వినాల్సివస్తుందో అని ఏ ఆత్మీయులని .కోల్పోవాల్సివస్తుంది ఏమో అని బాధ దయచేసి ప్రస్తుతం బయట పరిస్థితి భిన్నంగా ఉన్నాయి డబ్బు పలుకుబడి ఏవి కూడా పనిచేసే పరిస్థితి లేదు కోవిడ్ బారిన పడి ఎవరిని కోల్పోవాల్సివస్తుందో అని మనసు కలిచి వేస్తుంది. దయచేసి స్వచ్చందంగా మీకు మీరుగా భౌతిక దూరం స్వీయ నియంత్రణ మస్కలు ధరించడం శానిటేషన్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీకు మీరుగా ఇంట్లో వుండండి అత్యావరమైతే తప్ప బయటకి రాకండి ప్రాణము కన్న విలువ అయినది ఏది లేదు అని తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.


నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

ఛీ... నోరుమూయ్ అంటూ మహిళ పై విరుచుకుపడ్డ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ
నాలాగ ఏ పేషెంట్ బాధితులు ఎవరూ ఇబ్బంది పడకూడదని మహిళ ఆవేదన...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో ఆకస్మికంగా పేషెంట్ ని వేరే హాస్పిటల్ కి ఎక్కడైనా తరలించుకోవాలని ముందుగానే చెప్తున్నాను అని ఆక్సిజన్ రావడం లేట్ అవ్వచ్చు ముందుగానే చెప్పడం మా బాధ్యత అంటున్న డాక్టర్లు మీకు టైం ఇస్తాం అవకాశం ఉంటే వేరే హాస్పటల్  తీసుకెళ్లొచ్చు అని చెప్పడం జరిగింది. దీనిమీద ఆకుల సత్యనారాయణహాస్పిటల్ వద్దకు చేరుకుని డబ్బులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, డబ్బులు కట్టడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ లో అటువంటి మాటలు మాట్లాడకూడదు అంటూ, ప్రభుత్వ హస్పిటల్ తీసుకెళ్లి పొండి అని సలహాలు ఇస్తూ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడి మానసికంగా మహిళని ఇబ్బందులకు గురి చేశారు.ఈ ఆమె బాధపడుతూ మాట్లాడుతూ ఈ విషయం మీద మాకు వైద్యం కొనసాగించాలి అని లక్షలు లక్షలు డబ్భులు కట్టే జాయిన్ చేసుకున్నారు అని మాకు న్యాయం చేయాలని, ఒక రాజకీయ  నాయకుడు అయ్యుండి, అసభ్యంగా మాట్లాడి మమ్ములను 12 మంది పేషేంట్స్  వారు బందువులపై అసభ్యంగా మాట్లాడి,ఆయన కారును దురుసుగా డ్రై చేస్తూ మమ్ములను భయభ్రాంతులను చేశారు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.


ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

 ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండల రావూరుపాడు గ్రామ కాపు సంఘం ప్రెసిడెంట్, ఉత్తమ రైతు, జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ గురువారం మలకపల్లి పిహెచ్సిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రావూరుపాడు గ్రామ ప్రజలంతా కోవిడ్ నియంత్రణ నిబంధనలు పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను ఎల్లప్పుడూ శానిటైజేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రతీ ఒక్కరూ కరోన నియంత్రణ నిబంధనలు పాటించినపుడే కరోనాను తరిమికొట్టగలమని అన్నారు.


నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

 నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గోపాలపురం, పెన్ పవర్

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు, ఏఎస్పీ మరియు ఏసి వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది బుధవారం తనిఖీల్లో భాగంగా గోపాలపురం మండలం కొవ్వాడ ప్రోజెక్టు ఏరియా బుచ్చియ్యపాలెం గ్రామంలో నాటుసారా కు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టుబడిన బెల్లం ఊటను తమ సిబ్బంది సహాయంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

 


రాజమహేంద్రవరం,పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలని టీఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు.గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారిపోతుందని, గత రెండేళ్ళుగా కార్మికులకు వరుస కష్టాలు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఇసుక కొరత ఒక పక్క వేధిస్తుంటే మరో పక్కకరోనా లాక్ డౌన్ తో లక్షలాదిమంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ప్రస్తుతం ఏదో విధంగా పని కల్పించుకుని పని చేసుకుంటుంటే కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ పాక్షిక కర్ఫ్యూ విధించారన్నారు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది భవన నిర్మాణ కార్మికులేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు చేసే సమయంలో వాళ్ళు బయట తిరిగి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం లేదన్నారు. కేవలం కార్మికులు ఆయా భవనాల్లో మాత్రమే పనులు చేస్తారని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ వినియోగిస్తూ పనులు చేసుకుంటారని, కనుక ప్రభుత్వం ఈ పాక్షిక కర్ఫ్యూ నుంచి భవన నిర్మాణ కార్మికులకు తప్పక మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే గత ఏడాది  కరోనా లాక్ డౌన్ కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్న హామీని తక్షణం నెరవేర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని,తక్షణం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు రైతులకు, నేతన్నలకు,రజకులకు,దర్జీలకు ఇస్తున్న విధంగా భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించాలని,ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డులో గత ప్రభుత్వాలు పెట్టిన స్కీములను తొలగించాలనే ఆలోచనను తక్షణం విరమించుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమ స్కీములన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.


కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్

 కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్ 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

కరోనా మహామ్మారి రోజు రోజు కు విస్తరించి వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారు , కరోనా తో మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడం లో పేదలకు,మధ్యతరగతి వారికి భారంగా మారుతున్న తరుణంలో కరోనా వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికకు  తరలించేందుకు ఉపయోగించే " కైవల్య రధాలు" (వాహనాలు)ఏర్పాటు చేసేందుకు  పెద్ద మనస్సుతో రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ముందుకు వచ్చారు.కోవిడ్ వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా సేవా భావంతో  తరలించేందుకు వినియోగించే రెండు వాహనాలను జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ , రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్త ఆద్వర్యంలో వాహనాలు వినియోగిస్తారు.రాజమహేంద్రవరం  మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో బుధవారం జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ సభ్యులు  ఎం.ఆర్.పట్నాయక్ ద్వారా మున్సిపల్ కార్పోరేషన్ ఎం.హెచ్.ఓ. డాక్టర్ మూర్తి, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్ లు వాహనాలు ప్రారంభించారు.ఈ రెండు వాహనాలు  రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ తోపాటు రాజానగరం పరిధిలో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశాన వాటికకు తరలించేందుకు వినియోగిస్తారని తెలిపారు.  మృతి చెందిన వారి బాదిత కుటుంబాల వారు మృతదేహాలను తరలించేందుకు జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 9154622899ను సంప్రదించాలని కోరారు.


వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

తాళ్లపూడి, పెన్ పవర్

బుధవారం వేగేశ్వరపురం  గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నందున  సోడియం హైపో క్లోరైట్ ను  సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురమారావు, పంచాయతీ సెక్రెటరీ  వెంకట్రాజు ఆధ్వర్యంలో గ్రామంలో వీధులన్నీ పారిశుద్ధ్య కార్మికులచే  పిచికారి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది,  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురామారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని, బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనసమాజాన్ని కరోన బారినుండి కాపాడుకోవాలని తెలియజేశారు.


కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

తాళ్లపూడి, పెన్ పవర్

పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది.  వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని  సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి  గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.


ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

 ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని ఏపిఓ సత్యవతి సూచించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న కాలువ పనులను గురువారం ఆమె పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్లు విజయకుమార్, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.


గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో 20 కుర్చీలు బహుకరణ

 చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో  20 కుర్చీలు బహుకరణ

బిక్కవోలు, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం బిక్కవోలు చారిటీ సొసైటీ మరియు గ్లోబల్ విజన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.జాన్ డీన్ మరియు ప్రధానోపాధ్యాయులు సత్యవాణి రంగంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం 15 కుర్చీలు పి.హెచ్.సి డాక్టర్ ఎం.కృష్ణ చైతన్య మరియు డాక్టర్ ఎం.పద్మ వీరికి అందించారు. అలాగే సింగంపల్లి ఉప కేంద్రం ఆరోగ్య కేంద్రానికి 5 కుర్చీలు బహుకరిందం జరిగింది అని డాక్టర్లు తెలిపారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కీర్తిశేషులు ఎం.శామ్యూల్ రాజు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తు చేసుకుంటాము అని,మా వెన్నంటే ఉంటూ,  ప్రోత్సహించే వారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కుర్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

 కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

మెంటాడ, పెన్ పవర్ 

మండల కేంద్రం మెంటాడ అక్కడ అక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో సర్పంచ్ రేగిడి రాంబాబు వినూత్న ప్రసారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పించడం కష్టతరం అని గ్రామములో ఆటో ఏర్పాటు చేసి ప్రసారానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వము లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేసిందని, ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కిరానా, టిఫిన్, పాన్ షాపులు తెరిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకు కు కావలసిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబంధములు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు,  పెన్ పవర్

 పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...